27 అక్టోబర్ 2016

టీవీ,ఫోన్, ఇంటర్నేట్ ప్రభావం వల్ల నష్టాలు

మన జీవితాల్లో టీవీ, ఫోన్, ఇంటర్నెట్‌ చాలా ముఖ్యమైపోయింది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఎదైనా టికెట్ల బుకింగ్‌ ఇంటర్నెట్‌పైనే ఉంటేనే సాధ్యం, అలాంటి ఇంటర్నేట్ వాడాలంటే కంప్యూటర్,ల్యాప్ టాప్ ఉండాలి వాటికి డబ్బులు ఎక్కువ అవసరం కాబట్టి ప్రతివాళ్ళు మొబైల్ ఫోన్ తీసుకుని అందులోనే ఇంటర్నేట్ వాడుతున్నారు.ఇంటర్నెట్‌ వాడకం ప్రపంచ మొత్తం అనేక మార్పులు తీసుకువచ్చింది. అదే ముఖ్యంగా కుటుంబ సభ్యుల పక్కపక్కనే వున్నా వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వాచింగ్, ఛాటింగ్‌, పోస్టింగ్‌, కామెంట్స్‌తోనే కాలం గడిపేస్తున్నాం. ఇంటర్నెట్‌ వాటకం ఒక వ్యసనంగా మారిపోయింది. దీని వల్ల ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని విశ్లేషకులు బావిస్తున్నారు.
ఇంటర్నెట్‌ డీ అడిక్షన్‌ క్లినిక్స్‌ - ఇంటర్నేట్ ఎక్కువగా వాడుతున్న నేపథ్యంలో దిల్లీలోని ఎయిమ్స్‌ తొలిసారిగా ఇంటర్నెట్‌ డీ అడిక్షన్‌ క్లినిక్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రంలో ఇంటర్నేట్ అనేది వ్యసనంగా మారిన వారికి ప్రతి శనివారం రోజున కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. 2 సంవత్సరాల ముందు పదోతరగతిలో టాపర్‌గా వున్న విద్యార్థి ఇంటర్నెట్‌ను అదేపనిగా వాడకం మొదలుపెట్టిన్నాడు.తరువాత అతను చదువులో ఏమాత్రం రాణించలేకపోయాడు. కారణం అతనికి ఏకాగ్రత, శ్రద్ద లేకపోవడమేనని అతని తల్లిదండ్రులు చెప్పారు. ఇంటర్నెట్‌ ను వాడటం మాన్పించేందుకు అనేక రకాల ప్రయత్నించిన ఆ విద్యార్థిలో ఎటువంటి మార్పులు తీసుకురాలేదు.దీంతో ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. వాళ్లకి తల్లిదండ్రులు నమ్మలేని నిజం ఒకటి చెప్పారు. అన్నదమ్ములిద్దరు ఇంటర్నేట్ చూస్తుండగా ఇంట్లోకి దొంగలు వచ్చి దొంగతనం చేసుకుని వెళ్తుంటే వారిని చూసి కూడ పట్టించుకోకుండా ఉండిపోయారట. చిన్న వయస్సులోనే పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం, టీవీ చూపించడం, ఇంటర్నేట్ వాడటం, లాంటివి కట్టడిచేయకపోతే పిల్లల్లో, పెద్దల్లోను అనేక సమస్యలకు దారి తీస్తుందని వైద్యనిపుణులు తెల్చి చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరు 6 నుండి 8 గంటలు నిద్ర తప్పని సరిగా ఉండాలి ఎంతోమంది రాత్రి 2,3 గంటల వరకు ఇంటర్నేట్ లోను, ఫోన్, టీవీ చూడటం లాంటివి చేస్తున్నారు. ఇటువంటివి తగ్గించి ముందు ముందు వచ్చె సమస్యలకు దూరంగా ఉండండి. ప్లీజ్ ఇది అందరికి షేర్ చెయ్యండి. 

చార్మినార్- గొల్కొండ కోట వెనుక స్టోరి

మనలో చాలా మందికి రహాస్యాలు అంటే చాలా ఇంట్రస్ట్ గా చూస్తాం, వింటాం, అలాంటిదే ఇప్పుడు ఒక రహస్యం చూద్దాం.సుమారు 400 సంవత్సర నుండి కుతుబ్ షాహిలా రాజ్యానికి రాజధానే గొల్కొండ కోట, ఈ గొల్కొండ కోట కాకతీయ్యుల కాలంలో క్రీ.శ 1143 నిర్మించారు.ఓరుగల్లుని పాలించిన ప్రభువు కృష్ణదేవ్ దీనిని క్రీ.శ 1363 లో బహమది సూల్తాన్ మొదటి మహ్మద్ షాకు అప్పగించారు. బహమనిరాజ్యం పతనం అవుతున్న సందర్భంలో సూల్తాన్ కులి కుథుబ్ షా క్రీ.శ 1518 లో స్వతంత్ర రాజై గొల్కొండను రాజధానిగా చేసుకుని పట్టాభిషేకం చేసుకున్నాడు.
తర్వాత ఇబ్రహిం కుతుబ్ షానా కాలంలో గొల్కొండ నగర జనాబా పెరిగిపోయింది.నీటి వసతులు సరగా లేకుండా అంటువ్యాధులు ప్రభలినాయి, పట్టణాన్ని విస్త్రతపరచడం కోసం మూసీనదిపైన పురానాపుల్ నిర్మించాడు.ఇబ్రహిం కుతుబ్ షా మరణించిన తర్వాత అతని కుమారుడు కులికుతుబ్ షా నూతన నగరం నిర్మించాలని మూసినది వడ్డున నిర్మించిన నగరమే భాగ్యనగరం(హైదరాబాద్). మూసినది నడ్డిన నిర్మించిన ఈ నగరాన్ని తన ప్రియురాలికి బాగ్ మతి  పేరుని పెట్టాడు. బాగ్యనగరం అని పిలిచాడు. ప్రపంచ సుందర నిర్మాణాలలో హైదరాబాద్ లోని ఛార్మినార్ ఒక్కటి. ఇది క్రీ.శ 1792 లో మహ్మద్ కులీకుతుబ్ షా నిర్మించారు. ఈయన అరబ్, ఊర్దు, పర్షియన్, తెలుగు బాషలలో పాండిత్యం కలవాడు. ఊర్దు,తెలుగు బాషల్లో కూడ కవితలు రాశాడు. ఇయన భాగ్ మతి అనే బంజారా స్త్రీని ప్రేమించి 1589 లో పెళ్లిచేసుకున్నాడు.పెళ్లైన తర్వాత బాగ్ మతి ఇస్లాం మతాన్ని స్వీకరించి హైదర్ మహల్ అని పేరు మార్చుకుంది. దానిని అనుసరించి హైదరాబాద్ గా మారింది. కులీకుతుబ్ షా 1611 లో చనిపోయాడు. అదే సంవత్సరంలోనే బాగ్ మతి కూడ చనిపోయింది.తర్వాత గొల్కొండ కోటను సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా తో పాటుగా చివరిగా అబుల్ హసన్ కుతుబ్ షా కూడ పరిపాలించాడు. తానీషా కంటే చక్రవర్తిగా ఉన్న తానిషా మామ అబ్దుల్లా కుతుబ్ షాని డక్కన్ లో మొగల సేనానిగా ఉన్నఔరంగజేబు ఓడించి, మొగల్ చక్రవర్తి అయిన షాజహాన్ సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టె విధంగా అంగీకరించాడు. మొగలుల దండయాత్ర నుండి గొల్కొండను రక్షించడానికి మహారాష్ట్ర రాజైన శివాజీతో అబుల్ హసన్ సంది కుదుర్చుకున్నాడు. 1680 లో శివాజీ మరణం తర్వాత 1685 లో ఔరంగజేబు తన కుమారుడైన షా ఆరమ్ నాయకత్వంలో గొల్కొండపైన దండయాత్ర చేశాడు.మొదట గొల్కొండకే విజయం లభించినా కొంతమంది సేనానులు నమ్మక ద్రోహం వలన గొల్కొండ సైన్యాలు ఓడిపోయాయి. పర్యవసానంగా అబుల్ హసన్ సందిచేసుకున్నాడు. కొన్ని శాసనాలు క్రింద అబుల్ హసన్ కోటి పన్నులు చెల్లించాలి. సంవత్సరానికి రెండు లక్షల పన్నులు చెల్లించాలి. అక్కన్న, మాధన్నలను ఉద్యోగాలనుంచి తొలగించాలి. మొగల్ సైన్య వెళ్లిన తర్వాత అబుల్ హసన్ జాప్యం చేశాడు. ఔరంగజేబు కోపానికి వీరేనని బావించిన కొందరు. అంతపుర స్త్రీలతో అక్కన్న,మాదన్నల హత్యకు కుట్ర పన్నారు. 1686 మార్చి 24 న రాత్రి సుల్తానులతో సంప్రదించి ఇంటికి వెలుతున్న వారిని నడివీధిలో హత్యచేశారు.1683 లోఅబుల్ హసన్ కట్టవలసిన పన్నులు సకాలంలో చెల్లించలేదు. ఔరంగజేబు  1687 లో పిబ్రవరి 7 న దండయాత్ర చేశాడు. తానిషా గొల్కొండ కోట పై దాడిని 8 నెలలపాటు అడ్డుకున్నాడు. 1687 అక్టోబర్ 3 వ తేదిన ఔరంగజేబు లంచం ఇచ్చి గొల్కొండ కోట తలుపులు తెరిపించి గొల్కొండ కోటను తన వశం చేసుకున్నాడు. తానిషాని బందిగా తీసుకెళ్లి దౌలతాబాద్ కోటలో బందిగా 13 సంవత్సరాలు బందిస్తే అక్కడ తానిష మరణించాడు. దాంతో కుతుబ్ షా వర్గం అంతమోదింది. దక్కన్ లో మొగళులు ఆద్వర్యంలో నిజాం పాలన 1701 లో  ప్రారంభం అయ్యింది. అతి సుందరమైన పట్టనమే మన హైదరాబాద్.  ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినది. అందరికి షేర్ చెయ్యండి.