04 డిసెంబర్ 2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై బిజెపి ఆధ్వర్యంలో నిరసన... బిజెపి సీనియర్ నేత రవికుమార్ యాదవ్ పిలుపు...

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిగా అమలు చేయలేదని నేటి వరకు పెండింగ్లోనే ఉన్నాయని  శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి కాంటెస్ట్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందుబాటులో లేవని వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని గురువారం ఆయన స్వగృహంలో  నిర్వహించిన జిల్లా.జిల్లా నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులతో సంయుక్తంగా  ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ నాయకులతో మాట్లాడుతూ ఈనెల ఏడవ తేదీన ఇందిరా పార్కులో  భారీ ఎత్తున బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరుగుతుందని పిలుపునిచ్చారు. అనంతరం రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా  అధ్యక్షురాలు కొత్తపల్లి పద్మ మాట్లాడుతూ  బిజెపి నేతలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ దేవుళ్ళ పైన  వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆమె  వ్యాఖ్యానించారు. వాటిని వెంటనే వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మేరీ సలోమాన్. సరోజా రెడ్డి. స్వగృహ విజయలక్ష్మి. 106 డివిజన్ మహిళా మోర్ఛ ప్రధాన కార్యదర్శి ఆదిలక్ష్మి. ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి. ప్రధాన కార్యదర్శి స్వప్న. రాణి లతోపాటు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టాలని   బిజెపి ఆధ్వర్యంలో నిరసన... బిజెపి సీనియర్ నేత రవికుమార్ యాదవ్ పిలుపు...

Raju Sr Reproter
RR District 
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి