నుమరుగవుతున్న గోపీ చెరువునాలా...
కట్టపై రాళ్లు వేసి అక్రమనకు గురి... చెరువుకు దారేది...?
జిహెచ్ఎంసి అధికారులు చర్య తీసుకోండి...!
రంగారెడ్డి తెలుగు ఫోకస్ టీవీ
చెరువులలోకి కూడా వెళ్లకుండా చెరువుల దారులను మూసివేసి కబ్జాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంఘటన శేరిలింగంపల్లి 106 డివిజన్లో జరిగింది. ఇలాంటి సంఘటనలో ఇక్కడ ఉన్నవారికి అలవాటు పడింది. ఇలాంటి సంఘటనలు ఎవరి ద్వారా వస్తున్నాయి. ఎందుకు జరుగుతుంది. అనే సమస్యలను జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి వెళ్లకుండా ఎక్కడికక్కడే ఇలాంటి అస్తవ్యస్తమైన పనులకు కొంతమంది శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఇలాంటి సమస్యల పైన జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ చర్యలు తీసుకొని గోపీ చెరువులోకి ప్రజలు వెళ్లడానికి నాలా పైన వేసిన రాళ్లను మురికి చెత్తను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఎవ్వరికి దొరికినంత వారు దోచుకోవడమే ఈ కాలనీలో జరుగుతున్న పరిస్థితులు జిహెచ్ఎంసి. ఎమ్మార్వో. నేటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు, కండ్లకు కనిపిస్తున్న వైనాలు కూడా స్థానిక కార్పొరేటర్కు కనిపించినా నాకెందుకులే అన్న చందంగా వ్యవహరించడంతో ప్రజలు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. ఇక్కడ నాలాకు ఒక అప్డేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని నాలాను విశాలంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Raju Sr Reporter.
RR District.
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews
RR District.
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి