31 అక్టోబర్ 2025

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీసులు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను సన్మానించారు.

మాదాపూర్‌లోని టి-హబ్ గేట్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సైబరాబాద్ పోలీసులు “ఏక్తా దివాస్ స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఫిట్‌నెస్,సామరస్యం. సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికి మనం కలిసి రండి” అనే థీమ్‌తో 2 కిలోమీటర్ల “రన్ ఫర్ యూనిటీ” నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని. రితిరాజ్, ఐపీస్, డీసీపీ మాదాపూర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ ఎడిసిపి ఉదయ్ రెడ్డి, ఎసిపి సిహెచ్. శ్రీధర్, మియాపూర్ ఏసీపీ సీహెచ్. వై. శ్రీనివాస్ కుమార్, మాదాపూర్ జోన్ ఇన్స్పెక్టర్లు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి